అవసరమైతే నన్ను అరెస్టు కూడా చేస్తారు కావచ్చు అంటూ తెలంగాణ భవన్ లో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏసీబీ ముందుకు మరోసారి కేటీఆర్ వెళ్లనున్నారు. నేడు ఫార్ములా ఈ-కార్ కేసులో కేటీఆర్ను విచారించనున్నారు ఏసీబీ అధికారులు. ఈ తరుణంలోనే కేటీఆర్ మాట్లాడారు. చట్టం మీద గౌరవం ఉంది కాబట్టే ఏసీబీ విచారణకు ఎన్నిసార్లు పిలిచినా వస్తామని చెప్పాము.. ఇది మూడోసారి విచారణకు పిలవటం అన్నారు. మూడుసార్లు కాదు 30 సార్లు అయినా విచారణకు వస్తామని పేర్కొన్నారు.

కెసిఆర్ హరీష్ రావులను కాలేశ్వరం కమిషన్ల ముందు కూర్చోబెట్టారు… వారిని కమిషన్ ముందు కూర్చోబెట్టి పైశాచిక ఆనందం పొందుతున్నారని ఆగ్రహించారు. నన్ను ఏసీబీ విచారణకు మళ్లీ మళ్లీ పిలుస్తున్నారని ఫైర్ అయ్యారు. జైలుకు వెళ్లేందుకు నాకు భయం లేదు… ఒక్కసారి కాదు వందసార్లు అయినా జైలుకు పోతామని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. మీరు ఇచ్చిన 420 హామీలు దొంగ ఆరు గ్యారెంటీలు మీరిచ్చిన డిక్లరేషన్లు ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేశారు.