ఎన్ని అడ్డంకులు సృష్టించినా రేపటి సభ సక్సెస్ అవుతుంది – భట్టి

-

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర 108వ రోజు ఖమ్మం జిల్లాలో కొనసాగుతోంది. నేడు రూరల్ మండలం కోదాడ క్రాస్ రోడ్ నుండి భట్టి విక్రమార్క పాదయాత్ర ప్రారంభమైంది. పాదయాత్రలో పెద్ద ఎత్తున యువకులు, మహిళలు పాల్గొన్నారు. పాదయాత్రలో భాగంగా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ భట్టి ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రంలో స్వేచ్ఛ లేకుండా పోయిందని ఆరోపించారు.

ధనిక రాష్ట్రాన్ని బిఆర్ఎస్ నేతలు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులను అడ్డం పెట్టుకొని పాలిస్తున్నారని విమర్శించారు. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా రేపు ఖమ్మం లో జరగబోయే జనగర్జన సభ సక్సెస్ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. రేపటి సభ నుంచే రాహుల్ గాంధీ సందేశం ఇస్తారని తెలిపారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అన్ని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని భరోసా కల్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news