ఇవాళ హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు

-

ప్రస్తుతం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ లోనే ఉన్న సంగతి తెలిసిందే. శీతాకాలం విడిది కోసం నిన్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు. నిన్న ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు వచ్చారు. నేరుగా బొల్లారంలోని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిలయానికి వెళ్లారు.

Traffic

ఇవ్వాళ మధ్యాహ్నం రెండు గంటలకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ లో సొసైటీ శతాబ్ది ఉత్సవాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొననున్నారు. ఈ తరుణంలోనే.. ఇవ్వాళ ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బొల్లారం నుంచి బేగంపేట రూట్లో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. కాగా, నిన్న హైదరాబాద్‌ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు.

Read more RELATED
Recommended to you

Latest news