వరంగల్ జిల్లాలో విషాదం.. కరెంట్ షాకుతో ముగ్గురి మృతి

-

వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం మోత్య తండాలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ గురైన ముగ్గురు యువకులు మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. మొత్తం నలుగురు..విద్యుత్ షాక్ గురయ్యారు. అయితే… భూఖ్య దేవేందర్ అక్కడికక్కడే మృతి చెందారు. గాయాలతో ఉన్న శ్రీకాంత్, రవిని ఆసుపత్రిలో తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.

Tragedy in Warangal district VK

ఇక తీవ్ర గాయపడ్డ మరొకరిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు స్థానికులు. మంగళ వారం దుర్గమ్మ పండుగ నేపథ్యంలో ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్ గురయ్యారు ఈ నలుగురు వ్యక్తలు. అయితే…విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి చెందిన సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే నాగరాజు సంఘటన స్థలానికి చేరుకొని..కేసు బుక్‌ చేసుకున్నారు. మృతుల కుటుంబాలకు భరోసా కల్పించారు.

Read more RELATED
Recommended to you

Latest news