తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రచారకర్తగా ట్రాన్స్‌జెండర్‌

-

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల హడావుడి మొదలైంది. ఓవైపు ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలు రచిస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటూ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికారంలోకి రావాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. మరోవైపు ఎన్నికల అధికారులు ఓటర్ల జాబితాపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ క్రమంలోనే ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రానికి వచ్చింది. ఎన్నికల జాబితా, ఏర్పాట్లు తదితర అంశాలపై పరిశీలించింది.

ఈ నేపథ్యంలోనే తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ప్రచారకర్తగా తొలిసారి ఒక ట్రాన్స్‌జెండర్‌ ఎంపిక చేశారు అధికారులు. ఓటరు నమోదు, సవరణ, మార్పులు, చేర్పులు, ఓటు వినియోగం ప్రయోజనాలు తదితర అంశాలపై ప్రజలను చైతన్యం చేయడానికి ఎన్నికల కమిషన్‌ ప్రచార కార్యక్రమాలు చేపడుతూ ఉంటుంది. ఇందు కోసం పేరున్న నటులు, సెలబ్రిటీలు, సామాజిక వేత్తలను ప్రచారకర్తలుగా ఎంపిక చేస్తుంది.

అయితే ఈసారి వరంగల్‌ నగరంలోని కరీమాబాద్‌ ప్రాంతానికి చెందిన ట్రాన్స్‌జెండర్‌ లైలాను ఎంపిక చేశారు అధికారులు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో 3,600 మందికిపైగా ఉన్న ట్రాన్స్‌జెండర్లకు లైలా నాయకత్వం వహిస్తున్నారు. వారి సంక్షేమం కోసం జిల్లా అధికారులతో మాట్లాడి వరంగల్‌ ఎంజీఎం ఆసుపత్రిలో వారంలో ఒక రోజు వారికి ప్రత్యేక క్లినిక్‌ను ఏర్పాటు చేయించారు.

Read more RELATED
Recommended to you

Latest news