బండి సంజయ్ కాస్త జ్ఞానం పెంచుకోవాలి.. లేకపోతే.. : టీఆర్ఎస్ ఎంపీలు

-

మునుగోడు ఉపఎన్నిక ఫలితాల తర్వాత టీఆర్అఎస్ పై బీజేపీ చేశిన వ్యాఖ్యలపై టీఆర్అఎస్ ఎంపీలు స్పందించారు. బండి సంజయ్, వివేక్ లపై తీవ్రంగా ఫైర్ అయ్యారు. బండి సంజయ్‌ ఇప్పటికైనా జ్ఞానం పెంచుకోవాలని.. లేకపోతే కష్టం అవుతుంది అని హితవు పలికారు. కేటీఆర్‌ను విమర్శించే స్థాయి వివేక్​కు లేదన్నారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు.

వివేక్ డబ్బు, రాజకీయాలను మునుగోడు ప్రజలు తిరస్కరించారని ఎంపీ మాలోత్ కవిత అన్నారు. రాజకీయాల్లో అట్టర్ ప్లాప్ నేత వివేక్ మాత్రమేనని కేటీఆర్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతోన్మాద శక్తులకు మునుగోడు గట్టి గుణపాఠం చెప్పిందని కవిత అన్నారు

బీఆర్‌ఎస్‌ను అడ్డుకునేందుకే మోదీ, అమిత్ షాలు మునుగోడు ఉపఎన్నిక తెచ్చారని ఎంపీ వెంకటేశ్‌ మండిపడ్డారు. బీజేపీ పలు రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాలను మార్చిందని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీకి ఆదరణ ఉండదని మునుగోడు ప్రజలు తేల్చి చెప్పారని  స్పష్టం చేశారు. మునుగోడు తీర్పు బీఆర్ఎస్ బలోపేతానికి బాటలు వేసిందని ఎంపీ వెంకటేశ్‌ నేత అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news