తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేవలం ఏడు రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. అయితే ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి పార్టీ మాత్రం ప్రచారంలోనూ అలాగే అభ్యర్థులను ప్రకటించడంలోనూ… ఓటర్లను కలుపుకుపోవడం లోనే ముందంజలో ఉంది. సర్వేలు కూడా ఆ పార్టీకే మొగ్గు చూపిస్తున్నాయి.

ఇలాంటి నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి పార్టీకి మద్దతు ప్రకటించింది ముస్లిం సంస్థ. అసెంబ్లీ ఎన్నికలలో భారత రాష్ట్ర సమితి పార్టీకి మద్దతు ఇస్తున్నామని ఏపీ మరియు తెలంగాణ జమీయాతుల్ ఉలమా హిందూ సంస్థ ప్రకటన చేసింది. భారత రాష్ట్ర సమితి పార్టీని బలోపేతం చేయాలని మైనార్టీలను కోరింది. ఈ నిర్ణయం పై సంస్థ ఏపీ మరియు తెలంగాణ ఉమ్మడి అధ్యక్షుడు ముఫ్తి గయాసుద్దీన్, జనరల్ సెక్రటరీ ముఫ్తి జుబేర్ లకు మంత్రి హరీష్ రావు ధన్యవాదాలు తెలిపారు.