TSPSC పేపర్ లీక్ కేసు..నిందితులను డీబార్‌ చేయాలని కమిషన్ నిర్ణయం

-

రాష్ట్ర వ్యాప్తంగా టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంతో కమిషన్ పలు పరీక్షలు రద్దు చేయగా.. మరికొన్ని పరీక్షలు వాయిదా వేసింది. మరోవైపు ఈ కేసులో సిట్, ఈడీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటి వరకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) 44 మందిపై కేసు నమోదు చేయగా.. 43 మందిని అరెస్టు చేసింది. మొన్నటిదాకా ఇదంతా కేవలం క్వశ్చన్ పేపర్లు చేతులు మారిన వ్యవహారమని భావించిన అధికారులకు తాజాగా.. టెక్నాలజీని వినియోగించి టీఎస్పీఎస్సీలో చీటింగ్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఈ నేపథ్యంలో  తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(TSPSC) కీలక నిర్ణయం తీసుకుంది. ప్రశ్నపత్రాల లీకేజీతో ప్రమేయమున్న వారిని డీబార్‌ చేయాలని నిర్ణయించింది. సిట్‌ అరెస్టు చేసిన 37 మంది ఇకపై టీఎస్‌పీఎస్సీ నిర్వహించే ఎలాంటి పరీక్షలు రాయకుండా చేయాలని కమిషన్‌ ఆదేశించింది. దీనిపై అభ్యంతరాలుంటే రెండు రోజుల్లో వివరణ ఇవ్వాలని 37 మంది నిందితులకు టీఎస్‌పీఎస్సీ నోటీసులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Latest news