గ్రూపు 1 ఓఎంఆర్ షీట్స్ పెరగడం పై క్లారిటీ ఇచ్చిన TSPSC..!

-

తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్  గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్షను రద్దు చేస్తూ.. హైకోర్టు సింగిల్‌ జడ్జి బెంచ్ వెలువరించిన తీర్పు సబబేనని హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం బుధవారం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా జూన్ 11న నిర్వహించిన గ్రూప్-1 ప్రిలిమ్స్ ప‌రీక్ష‌పై టీఎస్‌పీఎస్సీ వివ‌ర‌ణ ఇచ్చింది. 258 పేప‌ర్లు అద‌నంగా వ‌చ్చాయ‌న్న ఆరోప‌ణ‌ల‌ను తోపిపుచ్చింది. పరీక్ష తర్వాత కొన్ని పేపర్లు కలిపేందుకు ఆస్కారమే లేదని పేర్కొంది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష రోజు జిల్లాల కలెక్టర్లు నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా.. 2,33,248 మంది ప‌రీక్ష రాసిన‌ట్టు ప్ర‌క‌ట‌న చేశామని టీఎస్‌పీఎస్సీ తెలిపింది. 

పారదర్శకత కోసం అదే విషయాన్ని మీడియాకు చెప్పడం జరిగిందని టీఎస్‌పీఎస్సీ పేర్కొంది. ఓఎంఆర్ స్కానింగ్‌లో 2,33,506 మంది ప‌రీక్ష రాసిన‌ట్లు తేలిందని చెప్పింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ 33 జిల్లాల్లో 994 ప‌రీక్షా కేంద్రాల్లో నిర్వ‌హించాం. ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు ప‌రీక్ష రాశారని.. అలాంటప్పుడు అభ్యర్థుల అంకెల్లో స్వ‌ల్పమార్పులు స‌హజ‌మేనని పేర్కొంది. స్కానింగ్ త‌ర్వాత తుది సంఖ్య ప్ర‌క‌టించామని చెప్పింది. ప‌రీక్ష త‌ర్వాత కొన్ని పేప‌ర్లు క‌లిపేందుకు ఆస్కార‌మే లేదని.. గ్రూప్-1 ప్రిలిమ్స్ నిర్వ‌హ‌ణ‌లో ఎలాంటి అవ‌క‌త‌వ‌క‌లు జ‌ర‌గ‌లేదని టీఎస్‌పీఎస్సీ వివరణ ఇచ్చింది. 

Read more RELATED
Recommended to you

Latest news