తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు TSRTC శుభవార్త

-

తెలంగాణ పదో తరగతి విద్యార్థులకు TSRTC శుభవార్త చెప్పింది. పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థిని, విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ అంటూ ఆర్టీసీ ఎంపీ సజ్జనార్‌ వెల్లడించారు. విద్యార్థులకు రవాణా విషయంలో అసౌకర్యం కలగకుండా TSRTC యాజమాన్యం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. తెలంగాణ విద్యా శాఖ సూచనల మేరకు పరీక్షా కేంద్రాల వద్దకు విద్యార్థులు ఉదయం 8.45 గంటలకు చేరుకునేలా ప్రత్యేక బస్సులను నడుపుతోందని చెప్పారు.

TSRTC good news for 10th class students of Telangana

సోమవారం (18.03.2024) నుంచి 02.04.2024 వరకు బస్సులు తిరుగుతాయి. మహాలక్ష్మి పథకం నేపథ్యంలో విద్యార్థినిలకు ప్రయాణం ఫ్రీ కాగా.. విద్యార్థులు తమ దగ్గర ఉన్న పాత బస్ పాస్, హాల్ టికెట్ చూపించి పరీక్షా కేంద్రం వరకు ఉచితంగా ప్రయాణించవచ్చు. ఎక్స్ ప్రెస్ బస్సుల్లో కాంబినేషన్ టికెట్ సదుపాయం కూడా వారికి అందుబాటులో ఉంది. కావున క్షేమంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించి.. ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని #TSRTC యాజమాన్యం విద్యార్థులను కోరుతోందని వివరించారు ఆర్టీసీ ఎంపీ సజ్జనార్‌.

Read more RELATED
Recommended to you

Latest news