జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన లో ట్విస్ట్

-

జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై గ్యాంగ్ రేప్ ఘటన లో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఆమ్నేషియా పబ్ నుంచి బాధితురాలిని ఇంట్లో డ్రాప్ చేస్తామంటూ తీసుకెళ్ళిన నిందితులు.. కారులో ఎక్కించుకొని ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేసినట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం పబ్ వద్ద వదిలేసి వెళ్లిన యువకులు.. బాలిక తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగారు పోలీసులు.

ఈ కేసు లో నిందితుల్లో ఇద్దరు మేజర్లు, ముగ్గురు మైనర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పుప్పాలగూడ కు చెందిన నిందితుడు సాదుద్ధీన్ మాలిక్ (18) అరెస్ట్ అయ్యాడు. పోలీసుల అదుపులో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కుమారుడు మైనర్ నిందితుడుగా ఉన్నాడు.

ఇక బంజారాహిల్స్ కు చెందిన నిందితుడు‌ ఉమేర్ కాన్, మరో ఇద్దరు మైనర్లు పరారీలో ఉన్నారు.
నిందితుల కోసం మూడు రాష్ట్రాల్లో టాస్క్ఫోర్స్ అండ్ వెస్ట్ జోన్ పోలీసులు గాలిస్తున్నారు. అత్యాచారం జరిగిన ఇన్నోవా కారు కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. బాలికపై అత్యాచారం ప్లాన్ ఇంకా ఎవరి హస్తం ఉందనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news