Telangana: తెలంగాణలో మరో ఇద్దరు రైతుల ఆత్మహత్య

-

తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరు రైతుల ఆత్మహత్య చేసుకున్నారు. పంట దిగుబడి రాక.. అప్పుల బాధతో ఇద్దరు రైతుల ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం వల్బాపూర్ గ్రామానికి చెందిన పోతరాజు పోచాలు (45) తన మూడెకరాల భూమిలో వరి, పత్తి సాగు చేశారు.

నీరు లేక తడి సరిగ్గా అందక దిగుబడి రాక నష్టపోయాడు. పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు పెరిగిపోవడంతో ఆందోళన చెందిన పోచాలు పురుగు మందు తాగడు. ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ నిన్న మృతి చెందాడు.

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం మల్లెందొడ్డి గ్రామానికి చెందిన నాగేశ(40) కుటుంబపోషణ, పొలం పెట్టుబడుల నిమిత్తం అప్పులు చేసి ఆయన తనకున్న రెండె కరాల్లో మిరప పంట వేయగా గిట్టుబాటు ధర లేక నష్టాలు వచ్చాయి. దీంతో మనస్తాపానికి గురైన నాగేశ పొలంలోనే పురుగుమందు తాగాడు. కుటుంబసభ్యులు వెంటనే గద్వాల ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే మృతి చెందాడు.

Read more RELATED
Recommended to you

Latest news