మావోయిస్టులపై ఉక్కుపాదం..అమిత్‌ షా బిగ్‌ స్కెచ్‌ !

-

మావోయిస్టులపై ఉక్కుపాదం మోపేందుకు ..కేంద్ర హోంమంత్రి అమిత్ షా బిగ్‌ స్కెచ్‌ వేశారు. కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, తెలంగాణ, ఒడిశా, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు,మంత్రులు పోలీస్ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు.

వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాలకు అభివృద్ధి సాయాన్ని అందిస్తున్న మరో అయిదు కేంద్ర మంత్రిత్వ శాఖల మంత్రులు కూడా ఈ సమావేశానికి హాజరవుతారు. డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ తోపాటు, కేంద్ర, రాష్ట్రాల, కేంద్ర సాయుధ పోలీసు దళాలకు చెందిన సీనియర్ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మార్గదర్శకత్వంలో 2026 మార్చి నాటికి వామపక్ష తీవ్రవాద (ఎల్‌డబ్ల్యుఇ) ముప్పును పూర్తిగా నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది.

 

ఇందుకోసం వామపక్ష ప్రభావిత రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహాయాన్ని అందిస్తోంది.
2023 అక్టోబర్ 6న వామపక్ష తీవ్రవాద ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆ సమావేశంలో, వామపక్ష తీవ్రవాద నిర్మూలనకు సంబంధించి కేంద్ర హోం మంత్రి సమగ్ర ఆదేశాలు ఇచ్చారు. మోడీ ప్రభుత్వ వ్యూహం కారణంగా, నక్సలైట్ల హింస 72 శాతం తగ్గింది. అలాగే 2010 సంవత్సరంతో పోలిస్తే 2023లో మరణాలు 86 శాతం తగ్గాయి. వామపక్ష తీవ్రవాదం నేడు కొన ఊపిరితో తన చివరి పోరాటం చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version