సీఎం కేసీఆర్ మరో నిజాం అయ్యారు – కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి

-

తెలంగాణ సీఎం కేసీఆర్ మరో నిజాం అయ్యారని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో పర్యటించిన కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి… ఈ సందర్భంగా మాట్లాడారు. కేసీఆర్‌ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైంది.. సీఎం ఫాంహౌస్‌లో ఉండి రాజకీయాలు చేస్తున్నారు.. డబుల్‌ బెడ్‌రూం, దళితబంధు ఇవ్వడంలో విఫలం.. ఉద్యోగాలివ్వడంలో బీఆర్‌ఎస్‌ సర్కారు ఫెయిల్ అంటూ ఫైర్‌ అయ్యారు కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి.

గత ఏడాది దేశ జిడిపి 7.2% అని.. ఇండియా ఆర్థికంగా శరవేగంగా అభివృద్ధి చెందుతుందని వెల్లడించారు. పదేళ్ల యూపీఏ గవర్నమెంట్ పూర్తిగా అవినీతిమయమైందని.. అసమర్థ నాయకులు, అసమర్థ పాలనకు నిదర్శనం యుపిఎ పాలన అని వివరించారు. గతంలో హైదరాబాద్ లోని లుంబినీ పార్కు, ఢిల్లీ లో టెర్రరిజం పంజా విసిరిందని.. ప్రపంచ దేశాల్లో భారత్ 5th లార్జెస్ట్ ఎకానమీ సాధించిన దేశం అన్నారు. రాబోయే రోజుల్లో ప్రపంచ దేశాల్లో మూడో స్థానానికి చేరుతామని.. 45 లక్షల ఇండ్లు యూపీఏ నిర్మిస్తే.. 3 కోట్ల ఇండ్లు కట్టించామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన మంత్రి అవస్ యోజన అమలు కావడం లేదని.. నేను కేసీఆర్ ను అడుగుతున్న డబుల్ బెడ్రూమ్ నిర్మాణం ఎటు పోయిందని మండిపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version