తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ లకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. సంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. కేంద్రం ఏం చేసిందంటూ అందరూ మాట్లాడుతున్నారని.. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి వస్తే.. ఈ పదేళ్లలో మోడీ ప్రభుత్వం ఏం చేసిందో చూపిస్తామన్నారు. గ్రామపంచాయతీలకు రాష్ట్రం నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని.. మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు సిద్ధమా..? అని సవాల్ చేశారు.
రామగుండం ఎరువుల ఫ్యాక్టరీకి ప్రధాని మోడీ వస్తే.. కేసీఆర్ ఫామ్ హౌస్ లో పడుకున్నారని విమర్శించారు కిషన్ రెడ్డి. తెలంగాణ మొత్తం కల్వకుంట్ల కుటుంబం చుట్టూ తిరిగేలా పదేళ్లుపరిపాలన చేశారు. మార్పు రావాలని కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే.. ఇచ్చిన 420 హామీలు అమలు చేయకుండా పూర్తిగా వైఫల్యం అయింది. పదేళ్లలో బీఆర్ఎస్ పై వ్యతిరేకత వస్తే.. కాంగ్రెస్ పార్టీ పై పది నెలల్లోనే వ్యతిరేకత పెరిగిందని తెలిపారు.