వివాదంలో వేం నరేందర్ రెడ్డి..ఉద్యోగాలు, డబుల్‌ బెడ్‌ రూంలు ఇప్పిస్తామంటూ మోసాలు ?

-

వివాదంలో సీఎం రేవంత్‌ రెడ్డి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి చిక్కుకున్నారు. వేం నరేందర్ రెడ్డి పేరు వాడుకుని ఉద్యోగాలు, డబుల్‌ బెడ్‌ రూంలు ఇప్పిస్తామంటూ మోసాలు చేస్తున్నారు. అయితే.. దీనిపై అలర్ట్‌ అయిన వేం నరేందర్ రెడ్డి…కీలక ప్రకటన చేశారు. ఇటీవల కొందరు వ్యక్తులు నా పేరు ఉపయోగించి డబుల్ బెడ్ రూమ్ లు ఇప్పిస్తామని,ప్రభుత్వ ఉద్యోగులకు ట్రాన్స్ ఫర్లు మరియు ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేసిన విషయం తెలిసి, పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.

Vem Narender Reddy

ఈరోజు రాచకొండ సీపీ గారు,వారి పోలీస్ బృందం ఆ గ్యాంగ్ ను అరెస్టు చేయడం జరిగిందని తెలిపారు వేం నరేందర్ రెడ్డి. కావున ఇకా నుంచి ఎవరైనా నా పేరు చెప్పి డబ్బులు వసూలు చేసినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది.ప్రజలు కూడా ఇలాంటి మోసపూరిత వ్యక్తుల మాటలు నమ్మవద్దని కోరుకుంటూ మళ్ళీ అలాంటి కాల్స్ వస్తే మా యొక్క ఆఫీస్ సిబ్బందిని సంప్రదించగలరన్నారు వేం నరేందర్ రెడ్డి.

WhatsApp:7566663335

-వేం నరేందర్ రెడ్డి
సీఎం ముఖ్య సలహాదారు
తెలంగాణ ప్రభుత్వం.

Read more RELATED
Recommended to you

Latest news