సంప్రదాయ విలువలు, ఆధునికత మేళవించిన రాష్ట్రం తెలంగాణ: వెంకయ్య

-

తెలంగాణ స్వరాష్ట్రం సాధించుకుని పదేళ్లు పూర్తయిన సందర్భంగా రాష్ట్రంలో దశాబ్ది వేడుకలు రంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో పలువురు రాజకీయ ప్రముఖులు రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు చెబుతున్నారు. సోషల్ మీడియాలో విషెస్ చెబుతూ ఆవిర్భావ వేడుకలను ట్రెండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణకు మహోజ్వల చరిత్ర, గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉంది అని వెంకయ్య నాయుడు అన్నారు. సంప్రదాయ విలువలు, ఆధునికత మేళవించిన రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. విభిన్న రంగాల్లో సుస్థిరాభివృద్ధికి చిరునామా తెలంగాణ అని పేర్కొన్నారు. భారత అభివృద్ధి పయనంలో తెలంగాణ కీలక భూమిక పోషించాలి అని ఆయన ఆకాంక్షించారు. అభివృద్ధిలో తెలంగాణ ఉన్నత శిఖరాలు చేరాలి అని ఆకాంక్షిస్తూ వెంకయ్యనాయుడు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news