బీజేపీకి విజయశాంతి రాజీనామా.. క్లారిటీ ఇదే

-

విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాములమ్మ సింగరేణి అంశంలో తన పార్టీకి కూడా కొంత వ్యతిరేకంగా ఉన్నదని మీడియాలో కొన్ని వార్తలు వస్తున్నాయని పోస్ట్‌ పెట్టారు. నేను ఎన్నడైనా నా తెలంగాణ ప్రజల పక్షమే… నా లక్ష్యం తెలంగాణ జన సంక్షేమమే అన్నారు.

అయితే, నాకు ఏ భిన్నాభిప్రాయం ఉన్నా… క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా అది పార్టీలో అంతర్గతంగా తెలియజేస్తాను తప్ప, మీడియా ద్వారా కాదంటూ తెలిపారు రాములమ్మ. ఈ విషయంపై గత రెండు రోజుల నుండీ నన్ను ప్రశ్నలు అడుగుతున్న అందరికీ, ఈ బదులు ఇయ్యవలసిన అవసరం ఉన్నదని భావిస్తూ… ప్రతిపక్షాలు చెబుతున్నట్లు బీజేపీ ( NDA) ప్రభుత్వం వల్ల ఏ విధమైన నష్టమూ సింగరేణి కి ఉండబోదని నమ్మకంతో విశ్వసిస్తూ…మీమవిజయశాంతి అంటూ పోస్ట్‌ పెట్టారు రాములమ్మ.

Read more RELATED
Recommended to you

Exit mobile version