బిజెపి మీటింగ్ ను… బోనాలతో పోల్చడం ఏంటి ? : విజయశాంతి

-

బిజెపి మీటింగ్ ను… బోనాలతో పోల్చడం ఏంటి ? అని ఫైర్ అయ్యారు విజయశాంతి. తెలంగాణ‌లో జరిగిన విజ‌య సంక‌ల్ప స‌భ‌తో టీఆర్ఎస్ నేతల గుండెల్లో రైళ్లు ప‌రిగెడుతున్నాయి. ప్రధానమంత్రి మోడీగారి ప‌ర్య‌ట‌న‌ రాష్ట్రంలోని బీజేపీ శ్రేణుల్లో నూత‌నోత్స‌హం నింపింది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సిద్ధంగా ఉండాలని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు సూచించారు. ప్రధానిగారి సభ గ్రాండ్ సక్సెస్ అయింది. బీజేపీ సమావేశాల సమయంలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొమ్ముతో ప్రకటనలు ఏర్పాటు చేసుకుని వెకిలి ఆనందం పొందిందన్నారు.

బోనాలకు వచ్చినంత జనం కూడా రాలేదని రాష్ట్ర మంత్రులు మాట్లాడడం వారి అవివేకానికి నిదర్శనం. అసలు పార్టీ మీటింగ్‌ని బోనాలతో పోల్చడమేంటి? కేసీఆర్ అండ్ కో మోడీ గారిని తిడుతూ అల్ప సంతోషాన్ని పొందుతున్నరు. మరోసారి అధికారంలోకి వస్తామని సీఎం కేసీఆర్ పగటి కలలు కంటున్నరు. తెలంగాణలో ఈ సారి కాషాయ జెండా ఎగరడం ఖాయమని వెల్లడించారు విజయశాంతి.

Read more RELATED
Recommended to you

Latest news