కెసిఆర్ ప్రభుత్వం పై విజయశాంతి సంచలన పోస్ట్..తెలంగాణ ప్రజలందరూ ఆయన కుటుంబమే !

-

సీఎం కేసీఆర్ పై బీజేపీ నేత విజయ శాంతి మరోసారి విరుచుకుపడ్డారు. అవును 4 కోట్ల తెలంగాణ ప్రజలందరూ బీఆరెస్ చెబుతున్నట్లు కేసీఆర్ గారి కుటుంబ సభ్యులే… ఎందుకంటే 4 కోట్ల ప్రజల నెత్తిపై అప్పు పెట్టి, అసలు… మొత్తం కొల్లగొట్టిండు కాబట్టి అంటూ నిప్పులు చెరిగారు. అవ్వలకు ఆసరా కేసీఆర్ గారి 2 వేల కన్నా… మిగతా పార్టీలు ఎందుకు ఎక్కువ ఇస్తమంటున్నయ్?.. ఎవలి ప్రతిభా కాదు, రాష్ట్ర ఆదాయం బట్టి పథకాలుంటయ్.. కాబట్టి అంటూ ఆగ్రహించారు. కంటి పరీక్షలు, కళ్లజోళ్ల ఖర్చుకై మీ కండ్ల ముందు కనబడ్డంత తినే , మీకు ఎంత మాత్రం ఖర్చు అయితది? అని నిలదీశారు.

vijayashanthi on ts assembly elections
vijayashanthi on ts assembly elections

బిందెల నీళ్ల బదులు మీ బీఆరెస్ ఇచ్చిన భగీరథ మిషన్, ప్రగతి భవన్‌ల ఎన్ని ట్రక్కుల ధనం పోసిందో యావత్ తెలంగాణకు తెలుసని.. కేసీఆర్ కిట్లు మీ కుటుంబం తిన్న తెలంగాణ మొత్తం పైసలల్ల 1 శాతం కనీసం ఉంటదా? గిరిజన యూనివర్సిటీకి ఇన్నేళ్లూ కనీసం భూమి ఇయ్యనిది బీఆరెస్ కాదా?అని ఫైర్‌ అయ్యారు. ఎన్నికల ముందు హైదరాబాద్ భూములు అడ్డగోలుగా అమ్మి, లిక్కర్ వేలం, ఓఆర్ఆర్ 35 సంవత్సరాల కుంభకోణాలు చేసి ఆ పైసలతో రుణమాఫీ చేసి, తర్వాతి ప్రభుత్వాల ఆదాయవనరుల్ని కూడా ఇప్పుడే కొల్లగొట్టిన కేసీఆర్ గారి ప్రభుత్వం… క్షమాపణకి అర్హత సైతం కోల్పోయిందన్నారు. ఇక వందల కోట్ల లిక్కర్ కుంభకోణాల ముందు కళ్యాణలక్ష్మి ఎంత ఉంటది… వారే చెప్పాలి..కర్షకుల రక్తం గురించి బీఆరెస్ మాట్లాడకుంటే మంచిదని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news