వలవేసి కుందేళ్లను పడతారు కానీ.. కేసీఆర్ లాంటి పులిని కాదు – బోయినపల్లి వినోద్

-

వలవేసి కుందేళ్లను పడతారు కానీ.. పులిని వలవేసి ఎలా పడతారో రేవంత్ రెడ్డికే తెలియాలంటూ సెటైర్లు వేశారు కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్. ఆరు గ్యారెంటీల అమలు కోసం ప్రభుత్వం జీవోలు వెంటనే విడుదల చేయాలి… పార్లమెంట్ ఎన్నికల కోడ్ పేరుతో కాలయాపన చేయొద్దని కోరారు. కరీంనగర్ కేంద్రంగానే పార్లమెంటు ఎన్నికలకు కేసీఆర్ గారు వ్యూహరచన చేయబోతున్నారన్నారు కరీంనగర్ మాజీ పార్లమెంటు సభ్యులు బోయినపల్లి వినోద్ కుమార్.

vinod kumar

కళ్యాణలక్ష్మీ,షాదీముబారక్ దరఖాస్తులను ఎందుకు ఆన్ లైన్ చేయడం లేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి…ఇచ్చిన హామీలను వంద రోజుల్లో అమలు చేయకుంటే ప్రజలే ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని ఫైర్ అయ్యారు. రాదనుకున్న తెలంగాణ ను తీసుకొచ్చామన్నారు. బండి సంజయ్ ఎం చేశాడని ప్రజలు ఓట్లు వేస్తారు…వెయ్యి కోట్లతో కరీంనగర్ ను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దిన ఘనత నాదేనన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ గడ్డపై గులాబీ జెండాలు ఎగరాలని పిలుపునించారు.

Read more RELATED
Recommended to you

Latest news