ఏఐతో వాయిస్‌ మార్చి.. రూ.6లక్షలు దోచుకున్న కిలాడీ లేడీ

-

ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్‌ రోజురోజుకు అభివృద్ధి చెందుతోంది. ప్రస్తతం అన్ని రంగాల్లోకి ఈ టెక్నాలజీ వచ్చేసింది. అయితే కొంతమంది దీన్ని ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ మహిళ.. ఏఐతో పురుషుడిలా వాయిస్‌ను మార్చి మరో యువతిని బెదిరించింది. డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేసి ఏకంగా రూ.6 లక్షలు దండుకుంది. ఈ ఘటన మహారాష్ట్రలోని జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. థానే జిల్లాకు చెందిన ఓ మహిళ.. తన పొరిగింటి యువతికి ఫోన్‌ చేసింది. ఏఐతో పురుషిడిలా వాయిస్‌ మార్చి బెదిరింపులకు పాల్పడింది.

ఆమెను మానసికంగా ఇబ్బందులు పెట్టింది. డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేసింది. ఇలా మొత్తం రూ.6 లక్షలకు పైగా ఆమె నుంచి కాజేసింది. చివరికి బాధితురాలు వేధింపులు తట్టుకోలేక.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అయితే ఏఐని ఉపయోగించి ఆమె ఇదంతా చేసిందని తెలియడంతో అందరూ షాక్ అయిపోయారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news