నాకు ఏదైనా జరిగితే ఆ బాధ్యత వరంగల్ తూర్పు ఎమ్మెల్యేదే – ఎర్రబెల్లి

-

టిఆర్ఎస్ పార్టీకి ఎర్రబెల్లి ప్రదీప్ రావు గుడ్ బై చెప్పారు. ఈ సందర్భంగా వరంగల్ లోని ప్రదీప్ రావు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ పదవుల ఆశ చూపించి నన్ను అవమానించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు ఏదైనా జరిగితే ఆ బాధ్యత వరంగల్ తూర్పు ఎమ్మెల్యేదేనని అన్నారు. ఎమ్మెల్యే నరేందర్ అనుచరుల నుంచి తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తెలిపారు ప్రదీప్ రావు. ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చానని.. కానీ ప్రజలకు కనీసం సహాయం చేయలేకపోతున్నానని వాపోయారు.

9 సంవత్సరాలు టిఆర్ఎస్ లో క్రమశిక్షణతో ఉండి నిస్వార్ధంగా పనిచేశానని తెలిపారు. తనకి ఎటువంటి పదవులు ఇవ్వకున్నా పార్టీకి సేవ చేస్తూనే ఉన్నానని అన్నారు. కనీసం గుర్తింపు లేనప్పుడు ఆ పార్టీలో ఉండే ఏం లాభం అన్నారు. సంస్కారం లేని నాయకులకు ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు ప్రదీప్ రావు. తాను ఏ పార్టీలో చేరాలో ఇంకా నిర్ణయం తీసుకోలేదు్నారు. వరంగల్ తూర్పు ప్రజలతో కలిసి ముందుకు నడుస్తానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news