నేను ప్రశ్నిస్తేనే కేసీఆర్ పోలీస్ అభ్యర్థుల వయోపరిమితి పెంచాడు: కే ఏ పాల్

-

నేను ప్రశ్నిస్తేనే కేసీఆర్ పోలీసు అభ్యర్థుల వ్యయోపరిమితిని పెంచాడని అన్నారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్. నిరుద్యోగ అభ్యర్థులు నన్ను సంప్రదించారని, వారి కోసమే నేను ప్రభుత్వాన్ని ప్రశ్నించాను అన్నారు. నేను చేసిన డిమాండ్ పై కేసీఆర్ స్పందించారు అని అన్నారు. ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ నోటిఫికేషన్స్ ఇస్తున్నారని అన్నారు పాల్.

కానిస్టేబుల్ ఉద్యోగాలకు ప్రిపేరయ్యే అభ్యర్థులు వయస్సు 31 సంవత్సరాలకు పెంచాలని ప్రభుత్వాన్ని అడిగానని, ప్రభుత్వం 32 సంవత్సరాలకి పెంచారు సంతోషమని అన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం పని చేస్తున్న ఏకైక పార్టీ ప్రజాశాంతి పార్టీ అన్నారు. ఇంటికో ఉద్యోగం, రైతులకు సహాయం చేస్తామన్నారు.. ఒక్క హామీ నైనా సక్రమంగా చేశారా అంటూ మండిపడ్డారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె ఏ పాల్. వచ్చే ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ కి ఏ పార్టీతో కూడా పొత్తు ఉండదని స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో ప్రతి నియోజకవర్గంలో పర్యటిస్తాను అన్నారు పాల్

Read more RELATED
Recommended to you

Latest news