ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలిచేది వైసీపీనే : మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్

-

ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసీపీనే గెలుస్తుందని.. వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి మళ్లీ సీఎం అవుతారని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ తెలిపారు. జిల్లాలో పార్లమెంట్ కానీ.. అసెంబ్లీ కానీ ఆయన ఎవ్వరూ అభ్యర్థి అంటే వారినే మనం కలిసి కట్టుగా పని చేసి గెలిపించాలి అని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా అందరం కలిసి కట్టుగా వైసీపీ పార్టీని గెలిపించుకోవాలి అని ధర్మాన కృష్ణదాస్ పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో అన్ని వర్గాలకు న్యాయం చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డినే అని చెప్పుకొచ్చారు ధర్మాన కృష్ణ దాస్ వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి ప్రాంతంలో 4500 కోట్ల రూపాయలతో మూలపేట వస్తుందని ధర్మాన తెలిపారు. ఉద్దానం ప్రాంతానికి ఆఫ్ సోర్ రిజర్వాయర్.. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ.700 కోట్లతో రక్షిత మంచి నీరు పథకం, రెండు వందల పడకల హాస్పిటల్ తీసుకొస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణ దాస్ చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news