కేసీఆర్ సభకు ఎందుకు రాలేదు : సీఎం రేవంత్ రెడ్డి

-

తెలంగాణ కి కేంద్ర బడ్జెట్ కేటాయించకపోవడం పై సీఎం రేవంత్ రెడ్డి సభలో చర్చకు అనుమతించాలని అడిగిన విషయం తెలిసిందే. కేంద్ర బడ్జెట్ చర్చ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్ సభకు ఎందుకు రాలేదని ప్రశ్నించారు. అందరి అభిప్రాయాలను తీసుకొని ముందుకు వెళ్తామంటే ఎందుకు వద్దంటున్నారు. సభలో మీ అభిప్రాయం ఏంటో చెప్పాల్సిందే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

ఇంత ప్రధానమైన అంశం జరుగుతుంటే.. కేసీఆర్ రాలేదు. మళ్లీ కేటీఆర్ ఇది చర్చనా..? కేంద్రాన్ని నిలదీసే సమయంలో ఎందుకు రాలేదు. చీకటి ఒప్పందాలతో తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. అయ్య పేరో, తాత పేరో చెప్పుకొని సభలోకి రాలేదని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. మొన్న ఢిల్లీకి వెళ్లి చీకటి ఒప్పందమే మీ అభిప్రాయమా..? మాకు తీర్మాణం కాపీ ఇవ్వలేదని కేటీఆర్ పేర్కొనడం గమనార్హం. ఒకవేళ కేటీఆర్ కి తీర్మాణం కాపీ అందకపోతే వారికి అందించండి అని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news