కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం : మంత్రి శ్రీధర్ బాబు

-

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని  మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ముఖ్యంగా సభలో నియమ నిబంధనలపై కేటీఆర్ వర్సెస్ శ్రీధర్ బాబు మధ్య మాటల యుద్ధం కొనసాగింది. డెమోక్రటిక్ గా బడ్జెట్ పై మీ అభిప్రాయం ఏమిటో చెప్పాలన్నారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి చర్చించుతుంటే.. సభలో వేరే విషయాలను మాట్లాడుతున్నారు కేటీఆర్.

సభ నుంచి బయటికి వెళ్లాలనే ఆలోచనలో బీఆర్ఎస్ చూస్తోంది. సీరియస్ ఇష్యూను కావాలనే పక్క దారి పట్టిస్తోంది. పదేళ్లలో బీఆర్ఎస్ ఎప్పుడూ ప్రజాస్వామ్యంగా ప్రవర్తించలేదు. రీ ఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం.. నిధుల కేటాయించలేదు.  తెలంగాణలో వెనుకబడ్డ జిల్లాలను కేంద్రం పట్టించుకోలేదు. షెడ్యూల్ 9, 10 అంశాలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు మంత్రి శ్రీధర్ బాబు. మరోవైపు తెలంగాణకు బడ్జెట్ కేటాయించకపోవడం పట్ల బీఆర్ఎస్ అసెంబ్లీ  తీర్మాణానికి మద్దతు ఇస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news