ఫలితం ఆశించకుండా పనిచేశా – కిషన్ రెడ్డి

-

పార్టీలో ఎటువంటి ఫలితం ఆశించకుండా పనిచేశానని అన్నారు కేంద్రమంత్రి, తెలంగాణ బిజెపి నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డి. బిజెపి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కుటుంబ పాలనను కూకటి వేళ్లతో పెకిలించడానికి అందరూ సిద్ధంగా ఉండాలని అన్నారు. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన తాను పార్టీ ఆఫీసులోనే ఉండి చదువుకున్నానని తెలిపారు. ఎన్నో పోరాటాలు చేసి, లాఠీ దెబ్బలు తిన్నానని తెలిపారు.

ఫలితం గురించి ఆలోచించకుండా పార్టీ కోసమే పని చేశానని.. తాను కేంద్ర మంత్రిని అవుతానని కలలో కూడా అనుకోలేదు అన్నారు. మేము ఏ పార్టీతో కలవమని స్పష్టం చేశారు. కల్వకుంట్ల కుటుంబాన్ని గద్దె దించడమే మా లక్ష్యం అని.. తెలంగాణ ప్రజలు బిజెపి నేతృత్వంలో యుద్ధం చేస్తారని తెలిపారు. ఒక అడుగు వెనక్కి వేశామంటే పది అడుగులు ముందుకు వేస్తామనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు కిషన్ రెడ్డి. 1000 మంది కేసీఆర్ లు, లక్ష మంది ఓవైసీలు, రాహుల్ గాంధీలు వచ్చినా 2024లో నరేంద్ర మోడీని అడ్డుకోలేరని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news