ప్రాణం తీసిన సెల్ఫీ.. కేబుల్ బ్రిడ్జి పై కారు ఢీ కొని యువకుడి దుర్మరణం

-

హైదరాబాద్ దుర్గంచెరువు తీగల వంతెనపై శుక్రవారం అర్ధరాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. సెల్ఫీ దిగుతున్న ఇద్దరు యువకులను వెనక నుంచి దూసుకొచ్చిన కారు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. మరొకరు గాయపడ్డారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా పెద్దపూడి మండలం పైన గ్రామానికి చెందిన ఎస్‌.అనిల్‌కుమార్‌(27) డ్రైవర్‌. అతని స్నేహితుడు కొమరపు అజయ్‌(25) సాయిబాబానగర్‌లో ఉంటూ కిరాణా దుకాణంలో పనిచేస్తున్నాడు. శుక్రవారం రాత్రి 12.30  సమయంలో ఇద్దరూ తీగల వంతెన సందర్శనకు వచ్చిన వీరు ద్విచక్ర వాహనాన్ని వంతెనపై నిలిపి సెల్ఫీ తీసుకుంటున్నారు. ఇంతలో ఇనార్బిట్‌ మాల్‌ వైపు నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది.

అనిల్‌కుమార్‌ను కొద్దిదూరం ఈడ్చుకెళ్లిన కారు డ్రైవర్‌ వాహనాన్ని ఆపకుండా పారిపోయాడు. అనిల్‌కు బలమైన గాయాలు కాగా అజయ్‌కు ముఖంపై, కాళ్లకు గాయాలయ్యాయి. సమాచారం అందుకుని ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. శనివారం తెల్లవారుజామున అనిల్‌కుమార్‌ మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రమాద స్థలంలో పడిపోయిన వాహనం నంబర్‌ప్లేట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు యజమాని బంజారాహిల్స్‌లోని ఇబ్రహీంనగర్‌కు చెందిన వెంకట్‌రెడ్డిగా గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news