తెలుగు క్రికెటర్ “మహమ్మద్ సిరాజ్” మంచి మనసు… !

-

ప్రస్తుతం ఇండియా టెస్ట్, వన్ డే మరియు టీ 20 సీరీస్ ఆడేందుకు వెస్ట్ ఇండీస్ కు వెళ్ళిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ కన్నా ముందుగానే అక్కడకు చేరుకున్న ఇండియా జట్టు ప్రాక్టీస్ లో నిమగ్నం అయి ఉంది. ఈ నెల 12 వ తేదీ నుండి మొదటి టెస్ట్ ఆడనుండగా… బార్బడాస్ క్రికెట్ గ్రౌండ్ లో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడ స్థానిక ప్లేయర్ లకు ఇండియా పేస్ బౌలర్ మహ్మద్ సిరాజ్ తన మంచి మనసును చాటుకున్నాడు. అక్కడ ఉన్న క్రికెటర్ లకు తన బ్యాట్ మరియు షూ లను ఫ్రీగా ఇచ్చాడు. ఈ విషయం తెలిసిన అభిమానులు సిరాజ్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ మంచి మనసును మరో నాలుగు రోజుల్లో జరగనున్న టెస్ట్ మ్యాచ్ లోనూ చూపించి ఇండియాకు విజయాన్ని అందిస్తాడా చూడాలి. కాగా ఈ టెస్ట్ సిరీస్ మరియు వన్ డే కు రోహిత్ శర్మ కెప్టెన్ గా ఉండగా, టీ 20 సీరీస్ కు మాత్రం సీనియర్ క్రికెటర్ లకు విశ్రాంతిని ఇచ్చి చాలా మందిని యంగ్ ప్లేయర్ లకు అవకాశం ఇచ్చింది.

అందులో తిలక్ వర్మ, జైస్వాల్, ముఖేష్ కుమార్ లు ఉన్నారు. ఈ టీమ్ కు హార్దిక పాండ్య కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news