ఆశ వర్కర్లకు శుభవార్త చెప్పిన కేసీఆర్ సర్కార్

-

రాష్ట్రంలో పనిచేస్తున్న 27 వేల మంది ఆశా వర్కర్లకు శుభవార్త చెప్పింది కేసీఆర్ సర్కార్. నేడు ఆశా వర్కర్స్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒక్కో ఆశ వర్కర్ పై 50,000 ఖర్చుపెట్టి శిక్షణ ఇచ్చి.. ఆరోగ్య కార్యకర్తలుగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ నెల నుండి ఆశా వర్కర్లకు ఇచ్చిన సెల్ ఫోన్ బిల్లులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది అన్నారు.

దేశంలో అత్యధిక వేతనం ఆశాలకు తెలంగాణలోనే ఇస్తున్నామన్నారు. నాలుకకు నరం లేదని ప్రతిపక్షంలోని వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆశాలకి గతంలో వేతనం పెంచమని అడిగితే గుర్రాలతో తొక్కించారని గుర్తు చేశారు. అర్ధరాత్రి ఆశా వర్కర్లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ లో ఉంచిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్నారు. ప్రధాని మోడీ రాష్ట్రం గుజరాత్ లో ఆశా వర్కర్లకు 4500 జీతం మాత్రమే ఇస్తున్నారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news