న్యూజీలాండ్‌లో MPగా తెలుగు అమ్మాయి.. 18 ఏళ్లకే అరుదైన గౌరవం

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన తెలుగు అమ్మాయికి ఓ అరుదైన గౌరవం దక్కింది. న్యూజిలాండ్‌ లో ఏపీ యువతి గడ్డం మేఘన ఎంపీగా ఎంపికయ్యారు. ఏపీలోని ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మేఘన… న్యూజిలాండ్‌ దేశ యూత్‌ పార్లమెంట్‌ సభ్యురాలిగా ఎంపికయ్యారు. తాజాగా ఆ దేశ నామినేటెడ్‌ ఎంపీ పదవుల ఎంపిక జరిగింది. దీనిలో భాగంగా సేవా కార్యక్రమాలు, యువత విభాగానికి ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్‌ సభ్యురాలిగా మేఘన ఎన్నికయ్యారు.

వాల్కటో ప్రాంతం నుంచి ఆమె ఈ నామినేటెడ్‌ పదవీకి ఎంపికయ్యారు. మేఘన తల్లిదండ్రులు న్యూజిలాండ్‌ లోనే స్థిరపడ్డారు. ఆమె తండ్రి గడ్డం రవికుమార్‌ ఉద్యోగ రీత్యా 2001 లో న్యూజిలాండ్‌ వెళ్లారు. అలా 21 ఏళ్ల క్రితం భార్య ఉషాతో కలిసి న్యూజిలాండ్‌ వెళ్లిన రవి కుమార్‌ అక్కడే సెటిల్‌ అయ్యాడు. ఇక అక్కడే పుట్టి పెరిగిన మేఘన.. కేంబ్రిడ్జిలోని సెయింట్‌ పీటర్స్‌ హై స్కూల్‌ లో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేసింది. అలాగే అనేక సేవ కార్యక్రమాల్లో పాల్గొంది. ఈ నేపథ్యంలో మేఘనకు ఈ అరుదైన గౌరవం దక్కింది.

Read more RELATED
Recommended to you

Latest news