బ్రేకింగ్ న్యూస్ : టీడీపీకి షాక్‌.. దేవినేని అవినాశ్ పార్టీకి రాజీనామా..

-

తెలుగుదేశం పార్టీలో యువనేతగా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలో ఆ పార్టీకి, తెలుగు యువత అధ్యక్ష పదవికి దేవినేని అవినాశ్ రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి పంపారు. ఆయనతో పాటు కడియాల బచ్చిబాబు కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఈ రోజు సాయంత్రం వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ సమక్షంలో ఆయన ఆ పార్టీలో చేరనున్నట్లు తెలుస్తోంది. అలాగే విజయవాడ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ గా బాధ్యతలు చేప‌ట్ట‌నున్న‌ట్టు స‌మాచారం.

తెలుగుదేశం పార్టీలో కష్టపడి పని చేస్తున్నప్పటికీ తగిన గుర్తింపు లభించడంలేదన్న అసంతృప్తితో ఉన్న అవినాశ్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్టీ మార్పు అంశంపై చర్చించేందుకు బుధవారం రాత్రి గుణదలలోని తన నివాసంలో దేవినేని నెహ్రూ అభిమానులు, అనుచరులతో సమావేశం నిర్వహించారు. సమావేశంలో మెజారిటీ కార్యకర్తలు, అభిమానులు, అనుచరులు పార్టీ మారాలంటూ ఆయనపై ఒత్తిడి తీసుకువచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news