బాసర ట్రిపుల్ ఐటీ వద్ద ఉద్రిక్తత.. ఏబీవీపీ కార్యకర్తలను అడ్డుకున్న పోలీసులు

-

చదువుల తల్లి శ్రీ జ్ఞాన సరస్వతి దేవి చెంతన ఉన్న ప్రతిష్ఠాత్మకమైన రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం బాసర ట్రిపుల్ ఐటిలో విద్యార్థుల ఆందోళన 6వ రోజుకు చేరింది. ప్రభుత్వం స్పందించకపోవడం పై విద్యార్థులు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. సమస్యల పరిష్కారానికి డైరెక్టర్ ఇస్తున్నహామీలు తోసిపుచ్చారు. ఈరోజు కూడా ఆందోళనలు కొనసాగుతాయని విద్యార్థులు స్పష్టం చేశారు. మరోవైపు క్యాంపస్ వద్ద పోలీసుల బందోబస్తు కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో నిజామాబాద్ నుంచి విద్యార్థులకు మద్దతుగా వచ్చిన ఏబీవీపీ కార్యకర్తలు క్యాంపస్ లోనికి చొచ్చుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు అడ్డుకోవడంతో వారు నినాదాలతో హోరెత్తించారు. పోలీసులను తోసుకొని ప్రాంగణంలోకి వెళ్లేందుకు యత్నించడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు బాసర పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Read more RELATED
Recommended to you

Latest news