గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షల వాయిదాపై టీజీ పీఎస్సీ కీలక ప్రకటన

-

తెలంగాణలో గ్రూప్-2, గ్రూప్-3 పరీక్షలు వాయిదా పడినట్లు నెట్టింట్లా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో గ్రూప్స్ పరీక్షలు వాయిదా అయినట్లు జరుగుతోన్న ప్రచారంపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్లారిటీ ఇచ్చింది. గ్రూప్-2, 3 పరీక్షలు వాయిదా వేశారన్న ప్రచారాన్ని టీజీపీఎస్సీ ఖండించింది. తెలంగాణలో యథావిధిగా గ్రూప్-2, 3 పరీక్షలు జరుగుతాయని ,పరీక్షలు వాయిదా పడినట్లు సోషల్ మీడియాలో జరుగుతోన్న ప్రచారాన్ని అభ్యర్థులు ఎవరూ నమ్మొద్దని తెలిపింది.టీజీపీఎస్సీ తాజాగా క్లారిటీతో గ్రూప్-2, 3 నెలకొన్న గందరగోళానికి తెరపడింది.

కాగా, డీఎస్సీ, గ్రూప్స్ పరీక్షలకు మధ్య సమయం తక్కువగా ఉండడంతో ప్రిపేర్ అయ్యేందుకు సమయం లేదని.. ఏదో ఒక పరీక్షను వాయిదా వేయాలని గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు ఆందోళన చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిరుద్యోగుల డిమాండ్‌కు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి.. గ్రూప్స్ పరీక్షలను వాయిదా చేసిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news