మమ్మల్ని గెలిపించినందుకు ప్రధాని మోడీకి ధన్యవాదాలు : శరద్ పవార్

-

రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోడి ఎక్కడెక్కడ రోడ్‌షోలు, ర్యాలీలు నిర్వహించారో ఆ స్థానాల్లో మహా వికాస్ అఘాడీ విజయకేతనం ఎగురవేసిందని ఎన్సీపీ నేత శరద్ పవార్ తెలిపారు. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో కూటమికి మద్దతిచ్చినందుకు ప్రజలకు తమ కృతజ్ఞతలు తెలపడానికి ఎస్‌సీపీ నేతలు శరద్ పవార్, పృథ్వీరాజ్ చవాన్‌ ,ఉద్ధవ్ ఠాక్రే శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు.

ఇందులోభాగంగా మీడియాతో శరద్‌ పవార్ మాట్లాడుతూ ” ప్రధాని నరేంద్ర మోడీ రోడ్‌షోలు నిర్వహించిన ప్రతిచోటా మేము గెలిచాము. అందుకే ప్రజలతో పాటు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు చెప్పడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను అని అన్నారు. మా గెలుపు కోసం ప్రచారం చేసిన మోదీకి ధన్యవాదాలు” అని తెలిపారు. శివసేన, ఎన్సీపీలో చీలికలు వచ్చిన తర్వాత అజిత్ పవార్‌- నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బీజేపీతో జట్టు కట్టింది. కాబట్టి తమ నుంచి విడిపోయిన ఆయన బంధువు అజిత్ పవార్‌ని తిరిగి తన పార్టీలోకి తీసుకునే అవకాశం లేదని శరద్‌ పవార్ స్పష్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news