వైసీపీ ఎమ్మెల్యే మిస్సింగ్…!

-

ఏపీలో శాసన సభా సమావేశాలు హాట్ హాట్ గా జరుగుతున్నాయి. ఈ శాసన సభా సమావేశాల్లో కొన్ని ఆసక్తికర పరిణామాలు ఉన్నాయి. ఏపీ లో శాసనసభ శీతాకాల సమావేశాలు జరుగుతున్న కీలక సమయంలో మా ఎమ్మెల్యే కనపడటం లేదు అంటూ వినూత్న నిరసన జరుగుతుంది రాజధాని ప్రాంతంలో. రాజధాని ప్రాంతం తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కనపడుట లేదంటూ ఉద్దండరాయని పాలెం దళిత రైతు పులి చిన్న ఫోటో ప్రదర్శించారు.

తమ ఎమ్మెల్యే ఎక్కడకు వెళ్లారు ఏమయ్యారు అంటూ ఫోటోతో ఆయన వెతకడం గమనార్హం. రాజధాని రైతుల సమస్యలు, దళిత అసైన్డ్ రైతులకు వార్షిక కౌలు పడలేదనే విషయాన్ని అసెంబ్లీ లో లేవనెత్తాలని ఎమ్మెల్యేకి విజ్ఞప్తి చేసారు. ఇటీవల ఆమె వరుస వివాదాల్లో ఉంటున్నారు. ఒక ఎంపీతో ఆమెకు ఎక్కువగా విభేదాలు ఉన్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version