కడియం శ్రీహరికి ఎమ్మెల్యే రాజయ్య కౌంటర్.. కెసిఆర్ ఆశీర్వాదం నాకే ఉంది !

-

జనగామ జిల్లా : స్టేషన్ ఘనపూర్ లో కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిన్న కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే రాజయ్య కౌంటర్ ఇచ్చారు. కడియం వ్యాఖ్యలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నానని.. తన కు కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఆశీర్వాదాలు ఉన్నాయని తెలిపారు. తాను కోరిన వరాలు కేసీఆర్ ఇస్తారని రాజయ్య ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు.

ఏ పదవి లేకపోయినా స్టేషన్ ఘనపూర్ ప్రజల కోసం కడియం పని చేస్తాననడం అభినందనీయమన్నారు. కానీ… ఎవరూ పని చేసినా అది తన అకౌంట్లోనే పడుతుందని పేర్కొన్నారు. కాగా ప్రజల కోసం పనిచేసే దెవరో… పైసలు తీసుకుని పని చేసేదెవరో కేసీఆర్ కు తెలుసునని నిన్న కడియం శ్రీహరి కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెల్యే రాజయ్య కౌంటర్ ఇచ్చారు. దీంతో కడియం – రాజయ్య మాటల యుద్ధం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news