అందుకే మనోజ్ సినిమాలకు దూరం అయ్యాడు అంటున్న ప్రముఖ దర్శకుడు..!

-

గత కొంతకాలంగా మంచు మనోజ్ , భూమా మౌనిక త్వరలోనే వివాహం చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపించిన విషయం తెలిసిందే. అయితే ఆ వార్తలలో నిజం లేదని తెలిసిపోయింది. ప్రస్తుతం ప్రముఖ టాలీవుడ్ దర్శకులలో ఒకరైన జి నాగేశ్వర రెడ్డి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. నేను నమ్మేది ప్రజెంటేషన్ ఆఫ్ మోడ్ అని చెప్పుకొచ్చారు. కొత్త కథలు అంటే అందులో మీనింగ్ లేదని ఈ జనరేషన్ కు విజువల్ వండర్ కావాలని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యంగా కొత్త కథ కాదని.. కొత్త ప్రజెంటేషన్ అవసరం అని కూడా ఆయన తెలిపారు.

ఇకపోతే ప్రస్తుతం కామెడీ సినిమాలు తగ్గిపోయాయని అనిల్ రావిపూడి మాత్రమే కామెడీ సినిమాలు తీస్తున్నారని చెప్పుకొచ్చారు. విష్ణుతో ఒక సినిమా చేయాలని అనుకుంటున్నారని తెలిపిన ఆ.. మనోజ్ అహం బ్రహ్మాస్వి ప్రాజెక్టు లేట్ కావడం వల్ల మిగతా ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం లేదని కూడా ఆయన వెల్లడించారు. కొత్త కథలతో మనోజ్ ఎంట్రీ ఇస్తారని చెప్పిన జి నాగేశ్వర్రెడ్డి.. మనోజ్ రాజకీయాల్లోకి వెళ్ళొచ్చని.. వెళితే తప్పేంటి అని కూడా వెల్లడించారు. ఇక మంచు లక్ష్మీ ప్రపంచం వేరు అని కూడా నాగేశ్వర్రెడ్డి తెలిపారు.

మంచు కుటుంబం చాలా తెలివైన వాళ్లు.. మనోజ్ సినిమాల్లో మళ్ళీ యాక్టివ్ కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు. సినిమా సినిమాకు మనోజ్ మార్కెట్ పెరుగుతుండగా.. ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ సైతం అంతకంతకు పెరిగిపోతుంది అంటూ ఆయన తెలిపాడు. ఇకపోతే అహం బ్రహ్మస్వి సినిమా షూటింగ్ లేట్ కావడం వల్లే ఆయన వేరే ప్రాజెక్టులలో నటించలేదు అంటూ తెలిపారు. ఏది ఏమైనా మంచు మనోజ్ త్వరగా ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని మరొక కొత్త ప్రాజెక్టుతో ముందుకు రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news