బాలు కోలుకుంటారనుకున్న.. కానీ..?

-

బాల సుబ్రమణ్యం మృతి సినీ ఇండస్ట్రీలో తీరని విషాదాన్ని నింపిన విషయం తెలిసిందే. చికిత్స తీసుకొని బాలసుబ్రహ్మణ్యం మళ్లీ తిరిగి వస్తారు అనుకున్న అభిమానులందరికీ బాలు మరణ వార్త గుండెలు పగిలేలా చేసింది . ఒక గొప్ప గానగంధర్వుడి భారతీయ కళామతల్లి కోల్పోయింది అని ఎంతో మంది సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన లేని లోటు భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎవరు తీర్చలేరు అంటూ బాలుడు మృతి పై సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

బాలు మృతి పై స్పందించిన ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఒక భావోద్వేగ పూరితమైన ట్విట్ పెట్టారు. సుబ్రహ్మణ్యం కోలుకుంటున్నారని సంతోషిస్తున్న తరుణంలో ఇలా జరగడం ఎంతో బాధ కలిగించింది అంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఐదున్నర దశాబ్దాలు గా బాలు తన అమృత గాత్రం తో ప్రజలని అలరింప చేసి… అనారోగ్య కారణాలతో మరణించడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాలు ఆత్మకు శాంతి చేకూరాలి అంటూ ప్రార్థిస్తున్నాను అంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news