మరో పథకానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ : 7.5 లక్షల మందికి ఉపాధి

-

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. టెక్స్‌టైల్స్ కోసం ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకాన్ని ఆమోదించింది కేంద్రం. గ్లోబల్ టెక్స్‌టైల్స్ ట్రేడ్‌లో భారత్ తన ఆధిపత్యాన్ని తిరిగి పొందేందుకు ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం ఉపయోగపడనుంది. ఈ పథకం భారత కంపెనీలు గ్లోబల్ ఛాంపియన్‌లుగా ఎదగడానికి సహాయపడుతుందని పేర్కొంది కేంద్రప్రభుత్వం.

ఈ పథకం వల్ల 7.5 లక్షల మందికి పైగా ప్రత్యక్షంగా మరియు అనేక లక్షల మందికి అదనంగా ఉపాధి కల్పించడంలో సహాయపడనుంది ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ (PLI) పథకం. ఈ పథకం పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొనడానికి మార్గం సుగమం చేస్తుందన్న కేంద్రం.. రూ.10,683 కోట్ల విలువైన ప్రోత్సాహకాలు ఐదేళ్లలో పరిశ్రమకు అందించబడతాయని పేర్కొంది.

ఈ పథకం వల్ల రూ. 19,000 కోట్లకు పైగా తాజా పెట్టుబడి మరియు ఐదు సంవత్సరాలలో రూ .3 లక్షల కోట్లకు పైగా అదనపు ఉత్పత్తి టర్నోవర్ లభిస్తుందని భావిస్తున్న కేంద్రం.. ఆశించిన జిల్లాలు & టైర్ 3/4 పట్టణాలలో పెట్టుబడికి అధిక ప్రాధాన్యత లభించనున్నట్లు తెలిపింది. ఈ పథకం ముఖ్యంగా గుజరాత్, యుపి, మహారాష్ట్ర, తమిళనాడు, పంజాబ్, ఎపి, తెలంగాణ, ఒడిశా మొదలైన రాష్ట్రాలపై సానుకూలంగా ప్రభావం చూపుతుందని పేర్కొంది కేంద్రం.

Read more RELATED
Recommended to you

Latest news