ఆ షో కి బాలయ్య పారితోషికం అన్ని కోట్లా..?

-

నట సింహం బాలకృష్ణ జోరుమీద ఉన్నాడు అని చెప్పవచ్చు. ఒక వైపు వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న ఈయన మరొకవైపు టీవీ షోలతో ప్రేక్షకులకు మరింత దగ్గర అవుతున్నాడు. తెలుగు ఓటీ టీ ప్లాట్ఫాం అయిన ఆహా లో అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె షో తో మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న బాలయ్య ఇప్పుడు ఈ షో కి సంబంధించిన రెండవ సీజన్ కి కూడా సిద్ధమవుతున్నారు. ఇకపోతే రెండవ సీజన్ కు బాలయ్య తీసుకుంటున్న పారితోషికం ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అంతే కాదు సీజన్ వన్ తో మంచి పాపులారిటీ ను సొంతం చేసుకున్న బాలయ్య, సీజన్ టు కోసం అధికంగా పారితోషకం తీసుకుంటున్నారని సమాచారం.

ఇకపోతే సీజన్ టూ కి సంబంధించిన మొదటి ఎపిసోడ్ త్వరలోనే ప్రారంభం అవుతుంది అని.. ఈ విషయాన్ని స్వయంగా బాలయ్య ప్రకటించడం గమనార్హం. ఇక బాలయ్య బాబు టాక్ షో ఎలా ఉంటుందో ఏంటో అనుకున్న వారంతా షాక్ అయ్యేలా ఈ షో కంటిన్యూ చేస్తున్నారు బాలకృష్ణ. ఇక టైటిల్ కి ఏ మాత్రం తగ్గకుండా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ను మొదటి సీజన్లో అందించాడు ఇప్పుడు మరొకసారి సీజన్ టు తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇక ఆగస్టు 15వ తేదీ నుంచి ఈ టాక్ షో రాబోతోంది అని ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

ఇకపోతే దర్శక నిర్మాతలకు అందుబాటులో ఉండేలా గా బాలకృష్ణ ఎప్పుడూ కూడా పారితోషికం డిమాండ్ చేయలేదట. ఇక ఆహా లో ప్రసారం అవుతున్న ఈ షో విషయంలో కూడా ఆయన డిమాండ్ చేయలేదని తెలుస్తోంది. అందుకే మొదటి సీజన్ కోసం ఆయన కేవలం కోటి రూపాయలను మాత్రమే తీసుకున్నట్లు సమాచారం .కానీ రెండవ సీజన్ మాత్రం పారితోషకం పెంచారు అని వార్తలు వినిపిస్తున్నాయి. అంటే ఒక్కొక్క ఎపిసోడ్ కి 25 లక్షల రూపాయలు తీసుకోబోతున్నట్లు సమాచారం. ఇక రెండవ సీజన్ లో కూడా 10 ఎపిసోడ్లు ఉంటాయి కాబట్టి మొత్తంగా రూ.2.5 కోట్ల వరకు బాలకృష్ణ కి పారితోషికం అందే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version