ముగిసిన సీఎం కేబినెట్ భేటీ.. పలువురు మంత్రులకు వార్నింగ్?

-

తెలంగాణ మంత్రులతో సీఎం రేవంత్ కేబినెట్ మీటింగ్ ముగిసింది. ఈ సమావేశంలో కేవలం పార్టీ అంతర్గత వ్యవహారాలు, జిల్లా మంత్రులు నియోజకవర్గ ఎమ్మెల్యేల మధ్య అంతరాలపై ప్రధానంగా చర్చించినట్లు తెలుస్తోంది.

CM Revanth Reddy
CM Revanth Reddy

ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీలో సమన్వయం కోసం అందరూ కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి కేబినెట్ మంత్రులకు సూచించినట్లు తెలిసింది. ఏ ఒక్కరూ పార్టీ, ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా ప్రవర్తించకూడదని హితవు పలికినట్లు సమాచారం. ఒకరిద్దరూ మంత్రులు తమ ఇష్టానుసారం వ్యవహరిస్తూ ఎమ్మెల్యేల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం లేదని వారి నుంచి ఫిర్యాదులు వస్తున్నట్లు ఈ సందర్భంగా సీఎం మంత్రుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ఈ కారణంగానే జడ్చర్ల ఎమ్మెల్యే ఇంట్లో పది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సమావేశం అయ్యారని, దీనికి కారణమైన మంత్రులను సీఎం రేవంత్ సీరియస్ హెచ్చరించినట్లు తెలుస్తోంది.

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news