ఓటుకు నోటు కేసు.. సీఎం విచారణకు రావాలని ఆదేశించిన కోర్టు

-

ఓటుకు నోటు ఈడీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు విచారణకు హాజరు కావాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇవాళ జరిగిన విచారణకు మత్తయ్య ఒక్కరే హాజరయ్యారు. రేవంత్ రెడ్డి, ఉదయ్ సింహ, వేంకృష్ణ కీర్తన్, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్ హాజరు కాలేదు. ఈడీ కేసు విచారణలో నిందితులు హాజరు కాకపోవడం పై నాంపల్లి ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. 

ఇవాళ విచారణకు మినహాయింపు ఇచ్చేందుకు అంగీకరించింది. తదుపరి విచారణకు తప్పకుండా హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది. వచ్చే అక్టోబర్ 16వ తేదీకి విచారణను వాయిదా వేసింది కోర్టు. ఆరోజు సీఎం రేవంత్ రెడ్డి సహా నిందితులు అందరూ కోర్టుకు హాజరు కావాలని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version