ఎమ్మెల్యే కూతురుకు వరకట్న వేధింపులు.. చివరికి..?

-

ఈ మధ్య కాలంలో ఎంతోమంది మహిళలు వరకట్న వేధింపులు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. పెళ్లి చేసుకున్న కొన్నాళ్ళ వరకు అంతా సజావుగానే ఉన్నప్పటికీ ఆ తర్వాతే అత్తింటివారు అసలు స్వరూపం బయట పెట్టి అదనపు కట్నం తీసుకురావాలని అంటూ ఎంతో మంది మహిళలను వేధింపులకు గురిచేస్తున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా ఎమ్మెల్యే కూతురు వరకట్న వేధింపులు తాళ లేక చివరికి పోలీసులను ఆశ్రయించింది. మహారాష్ట్రలో వెలుగులోకి వచ్చింది ఈ ఘటన.

మహారాష్ట్రలోని విజయ్ పూర్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే సీతారాం ఆదివాసి కూతురికి ఐదేళ్ల క్రితం వివాహం జరుగగా… కొన్నాళ్ల వరకు అంతా సవ్యంగానే ఉన్న ఆ తర్వాత వరకట్న వేధింపులు మొదలుపెట్టారు అత్తింటివారు. తండ్రికి చెప్పినప్పటికీ ఏదో ఒక విధంగా సర్దిచెప్పి ఊరుకునేవాడు.ఇక అత్తింటి వారి నుంచి వరకట్న వేధింపులు ఎక్కువ ఉన్న తరుణంలో చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది బాధితురాలు. దీంతో నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news