ఏడ్చేసిన ప్రముఖ యాంకర్

-

శాండల్‌వుడ్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ యాంకర్ అనుశ్రీ కన్నీటిపర్యంతమైది. ఈ కేసులో తనకు ఏ పాపం తెలియదని వాపోయింది. తనపై లేనిపోని ఊహాగానాలు వస్తున్నాయని వాటిని ఎవరూ నమ్మెుద్దు అంటూ కోరింది. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధమూ లేదంటూ ఓ వీడియో విడుదల చేసింది. సీసీబీ అధికారులు తనను విచారించినంత మాత్రాన తాను నేరస్థురాలిని కాదని చెప్పుకొచ్చింది. తనకు తెలిసిన వివరాలను అధికారులకు చెప్పానని, తాను ఏ తప్పు చేయలేదని చేతులు జోడించి విన్నవించుకుంది.

ఇదిలా ఉంటే డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్నాటక చిత్రసీమకు చెందిన మహిళా నటులు రాగిణి ద్వివేది, సంజన గల్రానీలు విదేశీ డ్రగ్స్ సరఫరాదారులతో చాటింగ్ చేసినట్టు సీసీబీ అధికారులు ఆధారాలు సేకరించారు. కొనుగోలు చేసిన మాదకద్రవ్యాలతో బెంగళూరు శివారులోని ఫామ్‌హౌస్‌లలో పార్టీలు చేసుకున్నట్టు సాక్ష్యాధారాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news