కొడుకును చంపిన తండ్రి.. కారణం..?

-

ఈ మధ్య కాలంలో మానవ బంధాలకు విలువ లేకుండా పోతుంది. ఏకంగా రక్త సంబంధాలను మరిచి సొంత వారి ప్రాణాలు తీస్తున్న ఘటనలు ఎన్నో మీదకి వస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. ఏకంగా కన్న కొడుకునే దారుణంగా హతమార్చాడు ఇక్కడొక కసాయి తండ్రి. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలి జిల్లాలో చోటు చేసుకుంది. క్వీల ప్రాంతానికి చెందిన తండ్రీ కొడుకుల మధ్య గత కొన్ని రోజుల నుంచి ఆస్తి పంపకాల విషయంలో వివాదాలు నడుస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఆస్తి కోసం ఏకంగా కొడుకు ని చంపాలనుకున్న తండ్రి దీనికోసం ప్లాన్ వేసి మరో ఇద్దరి సహాయంతో దారుణంగా కొట్టి చంపాడు. ఎవరికీ అనుమానం రాకుండా పూడ్చి పెట్టాడు. చివరికి కోడలు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు నిజం బయటపడింది. దీంతో మృతుడి తండ్రి తో పాటు సోదరుని కూడా అదుపులోకి తీసుకున్న పోలీసులు… పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version