ఫిబ్రవరి 8న విద్యాసంస్థలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

-

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. షబ్-ఎ-మెరాజ్ సందర్భంగా ఈనెల 8న సెలవు ప్రకటించింది. గతంలో విడుదల చేసిన క్యాలెండర్లో ప్రభుత్వం 8న ఆప్షనల్ హాలిడేగా ప్రకటించింది. తాజాగా దాన్ని సాధారణ సెలవుగా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

షబ్-ఎ-మెరాజ్ను ముస్లింలు పవిత్రమైన రోజుగా భావించి ప్రార్థనలు చేస్తారు. అంతేకాకుండా ఆ రోజు ముస్లింలు  మసీదులను దీపాలతో అలంకరించి రాత్రంతా జాగారం చేసి ప్రార్థనలు చేస్తారు.ప్రభుత్వ నిర్ణయంతో ఆరోజున ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలకు సెలవు ఉండనుంది.

Read more RELATED
Recommended to you

Latest news