తెలంగాణకు గుడ్ న్యూస్.. మరో వందే భారత్ రైలు

-

తెలంగాణలో రైలులో ప్రయాణించే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణ కు మరో వందే భారత్ రైలు ను ప్రకటించింది. సికింద్రాబాద్ నుంచి నాగపూర్ మధ్య ఈ నెల 15 నుంచి ఈ కొత్త సెమీ హై స్పీడ్ రైలు పరుగులు పెట్టనుంది. ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా దీనిని ప్రారంభిస్తారని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు.

ఈ వందే భారత్ రైలు నాగపూర్ నుంచి ఉదయం 5 గంటలకు బయలు దేరి.. మధ్యాహ్నం 12.15 గంటలకు కు సికింద్రాబాద్ చేరుకుంటుంది. మళ్ళీ సికింద్రాబాద్ లో మధ్యాహ్నం 1 గంటలకు బయల్దేరి రాత్రి 8.20 కి నాగపూర్ చేరుకుంటుంది. కాగా కాజీపేట, రామగుండం, బళ్లార, చంద్రపూర్, సేవాగ్రామ్ స్టేషన్లలో హాల్టింగ్ ఉంటుంది. సికింద్రాబాద్, నాగపూర్ నగరాల మధ్య 578 కిమీల దూరాన్ని కేవలం ఏడు గంటల్లో చేరుకుంటుంది. ఇక ఇప్పటికే తెలంగాణకు 4 వందే భారత్ రైళ్లు ఉండగా.. దీంతో ఐదు రైల్లు కానున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news