హత్రాస్ ఘటన తరహాలోనే మరొకటి.. రాళ్లతో కొట్టి మరీ.?

-

ఇటీవల ఉత్తరప్రదేశ్ లో జరిగిన అత్యాచారం హత్య ఘటన దేశవ్యాప్తంగా ఎంతో సంచలనం సృష్టించింది. ఉత్తరప్రదేశ్లో ఘటన మాత్రమే కాదు ప్రతి రోజూ దేశంలో ఎక్కడో ఓ చోట ఆడపిల్ల కామందుల బారినపడి బలవుతూనే ఉంది . ఆడపిల్లలపై అత్యాచారం చేసిన వారికి కఠిన శిక్షలు విధిస్తున్న పరిస్థితిలో మాత్రం మార్పు రావడం లేదు. హత్రాస్ ఘటన తరహాలోనే దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతమంది యువకులు అత్యాచారం చేయబోగా ప్రతిఘటించిన యువతి పై ఏకంగా రాళ్లతో దాడి చేసి మరీ అత్యాచారానికి ఒడిగట్టారు.

ఢిల్లీ కి చెందిన యువతి రాత్రి గురు గ్రామ్ ని సికిందర్పూర్ మెట్రో స్టేషన్ వద్ద రైలు కోసం ఎదురుచూస్తున్న సమయంలో యువతి పై కన్నేసిన యువకుడు యువతి వద్దకు వచ్చి రైలు రాకపోకలు లేవు అంటూ మాయమాటలు చెప్పి.. పక్కనే ఉన్న కాంప్లెక్స్ దగ్గరికి తీసుకెళ్లి అక్కడ ఉన్న మిగతా ముగ్గురు స్నేహితులతో సామూహిక అత్యాచారానికి యత్నించారు. యువతి ప్రతిఘటించి పారిపోతున్న సమయంలో రాళ్లతో కొట్టి మరీ దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు.దీని పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version